వైసీపీలో మరో వికెట్ పడింది. వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు కేటాయించడంతో అలకబూనిన రాధ చివరికి రాజీనామా చేశారు.
వైసీపీలో మరో వికెట్ పడింది. వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు కేటాయించడంతో అలకబూనిన రాధ చివరికి రాజీనామా చేశారు. అయితే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విజయవాడ వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. విజయవాడ సెంట్ర ల్ సీటును మల్లాది విష్ణుకి కేటాయించడంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న రాధాకృష్ణ చివరికి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ రాధాకృష్ణతో జరిపిన చర్చలు ఫలించలేదు. బొత్సాతో చర్చలు ముగిసిన వెంటనే రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న రాధాకృష్ఱ ఆ సీటుని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి కేటాయించడంతో అలక వహించారు. అయితే విజయవాడ సెంట్రల్ కి బదులు విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆఫర్ చేసింది. లేదంటే లోక్ సభ ఎన్నికల్లో బందరు పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాలని కోరింది. పార్టీ తీరుపై కొద్ది నెలల క్రితం రంగా మిత్రమండలి సభ్యులతో సమావేశమైన రాధా ఆ తర్వాత మౌనంగా ఉన్నారు. ఆయనతో విజయసాయి రెడ్డి కూడా చర్చలు జరిపారు. నేతల బుజ్జగించిన తర్వాత కూడా రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు.
వైసీపికి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ భవిష్యత్ కార్యాచరణపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. రాధ వైసీపీకి గుడ్ బై చెప్పగానే ఆయనతో టీడీపీ నేతలు టచ్ లోకి వచ్చారు. రాధాకి విజయవాడ సెంట్రల్ సీటును ఆఫర్ చేసినట్లు సమాచారం. రాధా కోసం విజయవాడ సెంట్రల్ సీటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న MLA బోండా ఉమని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే యోచనలో టీడీపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బోండా ఉమ ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోతే MLC పదవి ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీ ఆఫర్ పై వంగవీటి రాధాకృష్ణ రెండ్రోజుల్లో చెబుతానని అన్నట్లు సమాచారం.
అయితే విజయవాడ సెంట్రల్ సీటు కోసం తాను వైసీపీకి రాజీనామా చేయలేదని ఇంకా వేరే కారణాలున్నాయని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. వైసీపీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. వైసీపీకి సీనియర్ నేత వంగవీటి రాధ రాజీనామాతో విజయవాడ వైసీపీలో నైరాశ్యం నెలకొంది. పార్టీకి సీనియర్ నేత దూరం కావడంపై కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire