టీడీపీలో చేరిన వంగవీటి రాధా...టీడీపీలో చేరిన వైసీపీ నేతకు ఎమ్మెల్సీ అవకాశం...

టీడీపీలో చేరిన వంగవీటి రాధా...టీడీపీలో చేరిన వైసీపీ నేతకు ఎమ్మెల్సీ అవకాశం...
x
Highlights

వంగవీటి రాధాకృష్ణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వంగవీటి కుటుంబం ఒక చరిత్ర కల్గినదని చంద్రబాబు కొనియాడారు....

వంగవీటి రాధాకృష్ణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వంగవీటి కుటుంబం ఒక చరిత్ర కల్గినదని చంద్రబాబు కొనియాడారు. రాధాను సామాజిక బాధ్యత కల్గిన వ్యక్తిగా అభివర్ణించగా జగన్‌ తీరు మార్చుకోకపోతే ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని రాధా జోస్యం చెప్పారు.

దశాబ్దాలుగా టీడీపీకి బద్ధశత్రువుగా ఉన్న వంగవీటి కుటుంబం ఆ గడపే తొక్కింది. కొద్దిరోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీ కండువా కప్పుకున్నారు. రాధాను టీడీపీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే వైసీపీ నేత యడం బాలాజీ కూడా టీడీపీలో చేరారు.

వంగవీటి కుంటుంబానికి ఒక చరిత్ర ఉందని చంద్రబాబు అన్నారు. రాధాకృష్ణ సామాజిక బాధ్యత గల నేత అని పేదల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తని కొనియాడారు. టీడీపీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ వైసీపీ అధినేత జగన్‌ ద్రోహులతో కలిసి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తమ్ముడూ అంటూనే తనకు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు మరోసారి జగన్‌ను ప్రతిపక్ష నేతగా ఉంచబోతున్నారన్న రాధ ఇప్పటికైనా జగప్ తీరు మార్చుకోకపోతే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. వంగవీటి రాధాకృష్ణ పేరును పెడన అసెంబ్లీ స్థానానికి చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచరం. అలాగే యడం బాలాజీకి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories