చంద్రబాబు కోసం వంగవీటి పూజలు.. ఎందుకంటే..

చంద్రబాబు కోసం వంగవీటి పూజలు.. ఎందుకంటే..
x
Highlights

ఇటివలే వంగవీటి రాధ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థంపుచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికోసం...

ఇటివలే వంగవీటి రాధ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థంపుచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికోసం పూజలు నిర్వహిస్తున్నాడు. ఎందుకనుకుంటున్నారా!? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ సీఎం కావాలని గత మూడు రోజులుగా శ్రీయాగాన్ని తన చెల్లెలు, బావతో కలిసి చేయిస్తున్నారు వంగవీటి. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణమంటపంలో శ్రీయాగం నిర్వహిస్తున్నారు. కాగా నిన్న ఆదివారం పొద్దుగాల వంగవీటి రాధా సోదరి ఆశా, ఆమె భర్త కలిసి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.ఈ యాగం ఏప్రిల్ మూడుతో పూర్తికానుంది.

కాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఇటివల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి యాగం నిర్వహించి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే కాగా ఇదే తరహాలో ఏపీలో కూడా యాగాల, హోమాలు భాట పట్టారు. అయితే వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రాజశ్యామల యాగం చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. మార్చి 27నుంచి 29 వరకు నెల్లూరు జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి ఈ యాగాన్ని నిర్వహించినట్టు సమాచారం. మొత్తానికి ఎన్నికల వేళ యాగాలు చేసి ఏపీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఎదురుచూస్తున్నారు. మరీ ఈ యాగాలు చంద్రబాబుకు కలిసొచ్చునో లేక తిప్పికొట్టునో వేచి చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories