వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే...

వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే...
x
Highlights

ఏపీలో ఎన్నికల సమరం ముగిసిన ఇంకా యుద్ధవాతావరణం మాత్రం తగ్గడంలేదు. అధికార పార్టీ టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. ఏపీలోని కృష్ణా...

ఏపీలో ఎన్నికల సమరం ముగిసిన ఇంకా యుద్ధవాతావరణం మాత్రం తగ్గడంలేదు. అధికార పార్టీ టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలో మాత్రం ఇంకా ఈ ఉద్రిక్తతలు రోజు రోజుకు రగులుతునేఉన్నాయి తప్ప చల్లరడం లేదు. అయితే అసలు విషయానికోస్తే టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి వెళ్లడమే ఇందుకు అసలైన కారణం. ఎన్నికల సమరం ముగిసి నాటి నుండి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అభ్యర్థి ఇంటికి టీడీపీ ఎమ్మెల్యే వంశీ వెళ్లడం ఇప్పడు కొత్త వివాదానికి దారితీస్తోంది. గత కొద్దిరోజుల క్రితం వైసీపీ అభ్యర్థి వెంకట్రావుకు వంశీ ఫోన్ చేసి ఏపీ ఎన్నికల్లో భారీ మెజారీటితో గెలుస్తునందుకు నీకు పెద్ద ఎత్తున సన్మానం చేయాలని అనుకుంటున్నానని మీరు ఇంట్లో ఉంటే మర్యాదపూర్వకంగా కలిసివెళ్లానని అన్నారు.

వల్లభనేని వంశీ అనట్లుగానే వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి వెళ్లారు అయితే యార్గగడ్డ వెంకట్రావు మాత్రం ఇంట్లోలేడు చేసేది ఏమీ లేక వంశీ అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయారు. అయితే తమపై దాడి చేయడానికి టీడీపీ అభ్యర్థి వంశీ తమ ఇంటికి వచ్చారని వెంకట్రావు, వైసీపీ పార్టీ నేతలతో కలిసి పోలీసు ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దినికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందించారు వెంకట్రావు. వెంకట్రావు ఫిర్యాదు మేరకు విచారణ చేపడతామని పోలీసులు వైసీపీ నేతలకు హామీ ఇచ్చారు. మొత్తానికి గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య కొనసాగుతున్న ఈ ఆందోళనలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories