టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ!

టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ!
x
Highlights

తెలంగాణలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. వరంగల్‌,ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన తెలంగాణ...

తెలంగాణలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. వరంగల్‌,ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన తెలంగాణ పీఆర్టీయూ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ ఓటమిపాలయ్యారు. పూల రవీందర్‌పై యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయ కేతనం ఎగురవేశారు. నర్సిరెడ్డికి 8976 ఓట్లు రాగా పూల రవీందర్‌కు 6279 ఓట్లు మాత్రమే వచ్చాయి. పీఆర్టీయూ రెబల్ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డికి 1873 ఓట్లు నమోదయ్యాయి. గెలుపునకు కావల్సింది 9014 కావడంతో 38 ఓట్ల దూరంలో నర్సిరెడ్డి నిలిచిపోయారు. కాగా నర్సిరెడ్డి గతంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories