16వ లోక్‌సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం తీర్మానం

16వ లోక్‌సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం తీర్మానం
x
Highlights

16వ లోక్‌సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16వ లోక్‌సభను రద్దు చేస్తూ...

16వ లోక్‌సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16వ లోక్‌సభను రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఆమోదం తెలిపిన తీర్మానాన్ని ప్రధాని మోడీ కాసేపట్లో రాష్ట్రపతికి అందజేయనున్నారు. జూన్ 3తో 16వ లోక్‌సభ కాలపరిమితి ముగియనుంది. ఈలోగానే కొత్త ప్రభుత్వం కొలువుతీరాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీన సాయంత్రం వరకు ఢిల్లీ రావాలని బీజేపీ ఎంపీలను ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది. 26న బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories