టీడీపీకి గుడ్‌ బై చెప్పిన ఎంపీ ఎస్పీవై రెడ్డి

టీడీపీకి గుడ్‌ బై చెప్పిన ఎంపీ ఎస్పీవై రెడ్డి
x
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు జిల్లా టీడీపీకి షాక్‌ తగిలింది. ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు....

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు జిల్లా టీడీపీకి షాక్‌ తగిలింది. ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. టీడీపీ అధిష్టానం తనను నమ్మించి మోసం చేసిందని కంటతడి పెట్టుకున్నారు. బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం, లాబీయింగ్‌ చెయ్యడం తనకు చేతకాదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. తప్పకుండా ఒంటరి పోరులో విజయం సాధిస్తానని అన్నారు. టీడీపీని నమ్ముకున్నందుకు తగిన బుద్ది చెప్పిందని ఎస్పీవై రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories