గులాబీ లోకల్ మిషన్

గులాబీ లోకల్ మిషన్
x
Highlights

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలపై టీఆర్ఎస్‌ దృష్టి సారించింది. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ కీలక సమావేశం...

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలపై టీఆర్ఎస్‌ దృష్టి సారించింది. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయన అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అమలు చేయల్సిన ప్రణాళికపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. శ్రేణులను ఆ దిశగా సమాయత్త పర్చేలా కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ స్థానాలకు, 5,857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories