బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌ ఎంపీ..

బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌ ఎంపీ..
x
Highlights

టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. టీఆర్ఎష్ ఎంపీ సీటు దక్కకపోవడంతో అలకవహించిన జితేందర్ రెడ్డి పార్టీ మారారు. ఢిల్లీలో బీజేపీ...

టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. టీఆర్ఎష్ ఎంపీ సీటు దక్కకపోవడంతో అలకవహించిన జితేందర్ రెడ్డి పార్టీ మారారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. జితేందర్ రెడ్డి ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు. ఆయనకు కేసీఆర్ ఎంపీ సీటు ఇవ్వలేదు. అయితే సీటు ఇవ్వకపోయినా టీఆర్ఎస్‌లోనే కొనపాగుతానని చెప్పుకొచ్చారు. తర్వాత బీజేపీ అగ్రనేత రాం మాధవ్‌తో చర్చలు జరిపి చివరికి అదే పార్టీలో చేరారు.

బీజేపీలో చేరే విషయంపై జితేందర్ రెడ్డి ఇటీవల బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌తో మంతనాలు జరిపారు. పార్టీ మారడానికి జితేందర్ రెడ్డి మూడు షరతులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి.తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ పదవితో పాటు రాజ్యసభ సీటును ఆయన డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే రాజ్యసభ సీటుపై ఎలాంటి హామీ లభించలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. మరి చర్చల ఫలితం ఎలా ఉన్నా జితేందర్ రెడ్డి కాషాయ కండువా కప్పేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories