టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
x
Highlights

అధికార టీఆర్ఎస్‌‌లోని ఓ ఎమ్మెల్యే తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరిషత్ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులకు ఏకంగా మూడు టికెట్లు...

అధికార టీఆర్ఎస్‌‌లోని ఓ ఎమ్మెల్యే తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరిషత్ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులకు ఏకంగా మూడు టికెట్లు దక్కించుకున్న ఆ ఎమ్మెల్యేను సహచర నేతలు విస్తుపోతున్నారట. తాము అనుచరులకు కూడా టికెట్లు కేటాయించుకోలేకపోతుంటే ఏకంగా మూడు టికెట్లు ఎగరేసుకు పోవడంపై తమలో తాము మథనపడుతున్నారంట

ఇది చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్యామిలి స్టోరి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో తన భార్య, కుమారుడు, కోడలికి మూడు టిక్కెట్లు దక్కించుకోవడాన్ని చూసి సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. పరిషత్ ఎన్నికల్లో పలు చోట్ల తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు చివరి వరకు ప్రయత్నించినా చాలా మంది ఎమ్మెల్యేలు విజయం సాధించలేకపోయారు. అధిష్టానమే స్వయంగా అభ్యర్ధులను ఎంపిక చేసి వారినే గెలిపించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో కాలె యాదయ్యకు మూడు టికెట్లు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories