ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై హైకోర్టులో విచారణ

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై హైకోర్టులో విచారణ
x
Highlights

ఇంటర్‌ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫెయిల్‌ అయిన 3 లక్షలా 28 వేల మంది విద్యార్థుల రీ...

ఇంటర్‌ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫెయిల్‌ అయిన 3 లక్షలా 28 వేల మంది విద్యార్థుల రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఇంటర్‌ బోర్డు హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు మరో వారం రోజుల సమయం కావాలని అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్రావు కోరారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఈ నెల 15 న పూర్తి వివరాలు సమర్పించాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను 15 కు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories