ఎస్పీ-బీఎస్పీ పొత్తును గౌరవిస్తా: రాహుల్‌

ఎస్పీ-బీఎస్పీ పొత్తును గౌరవిస్తా: రాహుల్‌
x
Highlights

లోక్‌సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లో కూటమి కట్టా లన్న అఖిలేశ్‌, మాయావతిల రాజకీయ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లో కూటమి కట్టా లన్న అఖిలేశ్‌, మాయావతిల రాజకీయ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి సామర్థ్యంతో పోరాడుతుందని దుబాయ్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమని ఆ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం చెప్పారు. యూపీలో కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయొద్దని, ఒంటరిగానే పోటీ చేసే శక్తి తమకుందని తెలిపారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు కాంగ్రెస్ కు లేవని ఆ పార్టీ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ పీసీసీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాబోయే ఎన్నికలు నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరు అని కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ అభివర్ణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories