ప్రేమ పెళ్లి చేసుకొని ఎస్సై మోసం...పీఎస్‌ ఎదుట...

ప్రేమ పెళ్లి చేసుకొని ఎస్సై మోసం...పీఎస్‌ ఎదుట...
x
Highlights

ప్రేమ పేరుతో వెంటపడ్డాడు పెళ్లి చేసుకొని కాపురం పెట్టాడు. తీరా ఎస్సై ఉద్యోగం వచ్చే సరికి మొహం చాటేశాడు ఓ ప్రభుద్దుడు. దీంతో బాధితురాలు న్యాయం కావాలంటూ...

ప్రేమ పేరుతో వెంటపడ్డాడు పెళ్లి చేసుకొని కాపురం పెట్టాడు. తీరా ఎస్సై ఉద్యోగం వచ్చే సరికి మొహం చాటేశాడు ఓ ప్రభుద్దుడు. దీంతో బాధితురాలు న్యాయం కావాలంటూ ఏకంగా ఎస్సై పనిచేసే స్టేషన్ ముందే ధర్నాకు దిగింది కట్టుకున్న భార్య. తన భర్త తిరిగి కాపురానికి తీసుకెళ్లే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చుంది.

నెల్లూరు జిల్లా సంగంకు చెందిన నాగార్జున, లావణ్యలు కలిసి చదువుకున్నారు ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత నాగార్జునకు ఎస్సై ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్‌కు వెళుతున్నానని లావణ్యకు చెప్పి వెళ్లిన భర్త తిరిగి రాలేదు. భర్త ఆచూకీ కోసం ప్రయత్నించినా దొరకలేదు. కొన్నాళ్లు పుట్టింట్లో ఉన్న లావణ్య భర్త గుంటూరు జిల్లా అచ్చంపేట పీఎస్ లో శిక్షణ పొందుతున్నట్టు తెలుసుకుని నాగార్జున ఇంటికి వచ్చింది. లావణ్యను చూసిన నాగర్జున ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను బయటకు గెంటి వేసి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది.

ట్రైనింగ్ పేరుతో భర్త రెండేళ్లుగా కాపురానికి తీసుకెళ్లలేదని ఉద్యోగం రావడంతో తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది బాధితురాలు. తన భర్తతోపాటు అత్తమామలూ బెదిరిస్తున్నారని పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, పెళ్ళి సర్టిఫికెట్‌తో సహా పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించింది బాధితురాలు. తనను కాపురానికి తీసుకెళ్లే వరకూ ఆందోళన విరమించేది లేదంటుంది లావణ్య.

Show Full Article
Print Article
Next Story
More Stories