బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్‌ ఓడిపోతారు: కాంగ్రెస్‌ నేత

బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్‌ ఓడిపోతారు: కాంగ్రెస్‌ నేత
x
Highlights

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత జెట్టి కుసుమ కుమార్‌ విమర్శలు చేశారు. అసలు బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా సీఎం...

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత జెట్టి కుసుమ కుమార్‌ విమర్శలు చేశారు. అసలు బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా సీఎం కేసీఆర్‌ ఓడిపోతారని జెట్టి కుసుమ కుమార్‌ అన్నారు. మొన్నటికి మొన్న డా. బిఆర్ అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్తకుప్పలో పడేస్తే కనీసం స్పందించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి పదవికే సిగ్గుచేటు అని అన్నారు. కాగా రానున్న జెడ్పీ చైర్మన్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నేత జెట్టి కుసుమ కుమార్‌ డిమాండ్ చేశారు. జిల్లాల్లో జెడ్పీటీసీ సభ్యుల కంటే ఎక్స్‌అఫిషియో సభ్యులే ఎక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు. చిన్న జిల్లాల్లో ఎక్స్అఫిషియో సభ్యుల ఆధారంగా జెడ్పీలు కైవసం చేసుకునే కుట్ర జరుగుతోందని అన్నారు. అయితే మేడ్చల్ జిల్లాలో జెడ్పీటీసీలు నలుగురుంటే ఎక్స్అఫిషియో మెంబర్ల ఏడుగురున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీంఎం పేరు ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో గెలిచారని తీవ్రస్థాయిలో విమర్శించారు.





Show Full Article
Print Article
Next Story
More Stories