నాకు మంత్రి పదవి ఇవ్వండి.. వాళ్లను బాంబులతో లేపేస్తా!

నాకు మంత్రి పదవి ఇవ్వండి.. వాళ్లను బాంబులతో లేపేస్తా!
x
Highlights

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ శాసనసభ్యుడు విక్రమ్ సైనీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇప్పడు హట్ టాపిక్‌గా మారారు. భారతదేశంలో భద్రత లేదని అనుకుంటున్న వారందరినీ బాంబులతో లేపూయ్యాలని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ శాసనసభ్యుడు విక్రమ్ సైనీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇప్పడు హట్ టాపిక్‌గా మారారు. భారతదేశంలో భద్రత లేదని అనుకుంటున్న వారందరినీ బాంబులతో లేపూయ్యాలని అన్నారు. భారతదేశంలో అసలు రక్షణ లేదని అంటున్న ప్రతిఒక్కరిపై తీవ్రమైన చర్యలు తీసుకునేలా ఒక ప్రత్యేకమైన చట్టం తీసురావాలని ఎమ్మెల్యే విక్రమ్ సైనీ డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిప్రాయం మేరకు భారతదేశంలో భద్రత లేదని, బెదిరింపులకులోనవుతున్నట్లు అనుకుంటున్నా వారిని ఏకంగా బాంబులతో పేల్చేయాలని, నాకు మంత్రి పదవి అప్పగించండి ఒక్కరు కూడా మిగలకుండా పొట్టుపొట్టు కాల్చి లేపేస్తానని వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు విక్రమ్ సైనీ. కాగా దేశంలో మూకహత్యలు విఫరితంగా పెరుగుతున్నయని, దేశంలో పోలీసు అధికారుల ప్రాణాల కంటే గోవులకే రక్షణే ఎక్కువైందని బాలీవుడ్ న‌టుడు నసీరుద్దీన్ షా ఇటివల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories