ఊరెళ్తున్నారా...దొంగలు పొంచి ఉన్నారు.. ఇళ్లు భద్రం

Sankranthi
x
Sankranthi
Highlights

సంక్రాంతి పండగకు సొంత ఊళ్లకు వెళ్లుతున్నారా ఇంటికి తాళం వేసి పక్కింటి వాళ్లకు కొద్దిగా తమ ఇంటిపైపు చూడమని చెప్పి వెళ్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు ఊళ్లకు వెళ్లోచ్చేసరికి ఇల్లు గుల్ల చేస్తున్నారు సంక్రాంతి దొంగలు.

సంక్రాంతి పండగకు సొంత ఊళ్లకు వెళ్లుతున్నారా ఇంటికి తాళం వేసి పక్కింటి వాళ్లకు కొద్దిగా తమ ఇంటిపైపు చూడమని చెప్పి వెళ్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు ఊళ్లకు వెళ్లోచ్చేసరికి ఇల్లు గుల్ల చేస్తున్నారు సంక్రాంతి దొంగలు. పండగకు వేళ్లే వారు స్థానికు పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

సంక్రాంతి పండగ అనగానే హైదరాబాద్ సగం వరకు ఖాళీ అవుతోంది. సంక్రాంతి పెస్టివల్ సెలెబ్రేషన్ చేసుకునేందుకు చాలా మంది సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్తుంటారు. సొంత ఊళ్లకు వెళ్లి పండగ చేసుకుంటుంటే సంక్రాంతి దొంగలు మాత్రం సిటీలో పండగా చేసుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు దొంగలకు పెద్ద పండగే. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గేట్ చేసుకుని వరుస చోరీలు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీస్ కేస్ స్టడీ ప్రకారం సిటీ శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు తమ దోపిడీలను కొనసాగిస్తున్నారు. వరుస సెలవులనే తమ దోపిడీలకు మంచి సమయంగా ఎంచుకుని కాలనీల్లో ఈ ముఠాలు రెక్కీ నిర్వహిస్తాయి. తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి పగలు రాత్రి అని తేడా లేకుండా చోరీలు చేయిస్తాయి ముఠాలు అందుకోసం శివారు ప్రాంతాల్లోని కాలనీలు, పోలీస్ నిఘా తక్కువగా ఉండే ఏరియాల్లోని ఇళ్లనే తమకు చోరీలకు అనువైన ప్రాంతాలుగా సెలెక్ట్ చేసుకుంటాయి.

ఈ సంక్రాంతి పండుగకు దొంగతనాల నియంత్రణకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ , రాచకొండ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో సంక్రాంతి సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై ఇప్పటికే అధ్యయనం చేసి ఆ ప్రాంతాలను మ్యాపింగ్ చేశారు. ఆ స్పాట్స్‌ల్లోనే ఎందుకు ఎక్కువ చోరీలు జరిగాయి ఏ కారణాలు దొంగలకు అనుకూలించాయనే అంశాలను పరిశిలీస్తున్నారు. ఆ ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసుకుని సరికొత్త యాక్షన్ ప్లాన్‌కు శ్రీకారం చుడుతున్నారు.

ప్రతీ ఇంటి ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలను సులువుగా గుర్తించవచ్చన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. ప్రతి ఏరియాలో ఆటోలు కి ఫ్లైక్సీ లు కట్టి అవగాహన కలిపిస్తున్నాం అంటున్నారు పోలీసులు సంక్రాంతి పండగ సందర్బంగా ఇప్పటికే కొన్ని ముఠాలు నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఎంత రిక్కీ నిర్వహించిన సొంత ఊళ్లకు వేళ్లే వారు పోలీసులు చెప్పిన జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు అంటున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories