కాంగ్రెస్‌కు షాక్... టీఆర్ఎస్‌లో చేరనున్న సీనియర్ నేత

కాంగ్రెస్‌కు షాక్... టీఆర్ఎస్‌లో చేరనున్న సీనియర్ నేత
x
Highlights

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. మహబూబాబాద్ కాంగ్రెస్ జడ్పీటీసీ, జడ్పీ ప్లోర్ నాయకుడు ఎం. వెంకన్న టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకొనున్నారు. ఈ విషయంపై గత రెండ్రోజుల క్రితమే కడియం శ్రీహరితో కలిసి మంతనాలు జరిపినట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. మహబూబాబాద్ కాంగ్రెస్ జడ్పీటీసీ, జడ్పీ ప్లోర్ నాయకుడు ఎం. వెంకన్న టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకొనున్నారు. ఈ విషయంపై గత రెండ్రోజుల క్రితమే కడియం శ్రీహరితో కలిసి మంతనాలు జరిపినట్లు సమాచారం. కాగా రేపో, మాపో కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పి కారేక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 26మంది జడ్పీటీసీలు గెలుపొందగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుండి వెంకన్నతో పాటు ఆరుగురు మాత్రమే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీ డిప్యూటీ ప్లోర్ లీడర్‌గా ఉన్న ఆత్మకూర్ జడ్పీటీసీ తేతాకుల సంజీవరెడ్డి కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే దీంతో వెంకన్న కూడా కారేక్కేందుకు రెడీ అయ్యాడు. అయితే వెంకన్నకూడా టీఆర్ఎస్ లో చేరితో కాంగ్రెస్ జడ్పీటీసీల సంఖ్య చివరికి ఐదుకు చేరే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories