బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఉగ్రదాడులకు అవకాశం : ఇంటిలిజెన్స్ వర్గాలు

బుద్ధ పూర్ణిమ సందర్భంగా  ఉగ్రదాడులకు అవకాశం : ఇంటిలిజెన్స్ వర్గాలు
x
Highlights

శ్రీలంకలో ఇటీవల జరిగిన ఉగ్రదాదుల వంటి దాడులు మన దేశంలోనూ జరిగే అవకాశం ఉందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది ఇంటిలిజెన్స్ విభాగం నుంచి. బుద్ధ...

శ్రీలంకలో ఇటీవల జరిగిన ఉగ్రదాదుల వంటి దాడులు మన దేశంలోనూ జరిగే అవకాశం ఉందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది ఇంటిలిజెన్స్ విభాగం నుంచి. బుద్ధ పూర్ణిమ సందర్భంగా భారత్ లో దాడులు నిర్వహించడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారనడానికి కచ్చితమైన ఆధారులున్నాయని ఇంటిలిజెన్స్ విభాగం హెచ్చరిస్తోంది.

భారత్ లో పలు చోట్ల భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న కచ్చితమైన సమాచారంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ముగ్గురు టెర్రరిస్టులు నేపాల్ గుండా జమ్ముకశ్మీర్ లోని బండిపొరాకు చేరుకున్నట్టు సమాచారం. మరోవైపు, బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేస్తున్న జమాత్ ఉల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఓ మహిళా సూసైడ్ బాంబర్... బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్ లలోని బౌద్ధ ఆలయాలపై దాడికి పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో ఆగ్నేయ ఆసియా దేశాల్లోకి ఐసిస్ ప్రవేశించిందని ఇంటెలిజెన్స్ ఓ నిర్ధారణకు వచ్చింది.

ఉగ్రదాడుల కోసం మహిళా సూసైడ్ బాంబర్ రంగంలోకి దిగడం కలవరపరుస్తోంది. బుద్ధ పూర్ణిమ (మే 18) నాడు ఆమె దాడులకు తెగబడే అవకాశం ఉందని సమాచారం. బౌద్ధ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేలా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories