పరిషత్ ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారు

పరిషత్ ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారు
x
Highlights

తెలంగాణ వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారైంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు...

తెలంగాణ వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారైంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజున ఉదయం 8 గంటలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్టు తెలిపింది. మే 27వ తేదీన పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించాలని మొదట భావించినప్పటికీ నల్గొండ, వరంగల్, రంగారెడ్డి శాసనమండలి ఎన్నిక ఈ నెల 31న జరగనుంది. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ 3న ఉండటంతో అవి ముగిసిన వెంటనే పరిషత్ ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories