సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనానికి టీఆర్‌ఎస్ కుట్ర : కుంతియా

సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనానికి టీఆర్‌ఎస్ కుట్ర : కుంతియా
x
Highlights

సీఎల్పీని టీఆర్‌ఎస్‌‌ ఎల్పీలో విలీనం చేయాలని అధికార టీఆర్‌ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ కుంతియా ఆగ్రహం...

సీఎల్పీని టీఆర్‌ఎస్‌‌ ఎల్పీలో విలీనం చేయాలని అధికార టీఆర్‌ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ కుంతియా ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఇంటర్‌ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నా సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ నేత కుంతియా. ప్రభుత్వం వేసి కమిటీ కూడా తప్పులు జరిగాయని చెప్పినా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను కాపాడేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తప్పులను సరిదిద్దడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories