8 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్.. రేవంత్ పోటీ ఎక్కడ్నుంచంటే..

8 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్.. రేవంత్ పోటీ ఎక్కడ్నుంచంటే..
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడతుండంతో కాంగ్రెస్ పార్టీ జోరుపెంచింది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించముందే...

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడతుండంతో కాంగ్రెస్ పార్టీ జోరుపెంచింది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించముందే కాంగ్రెస్ పార్టీ రెట్టింపు వేగంతో దూసుకెళ్తుతోంది. ఎనిమిది మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వెనకంజలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మాత్రం పక్క ప్రణళికతోనే అడుగులు వేస్తోందని అర్ధమౌతుంది. 8మంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే. 1. ఆదిలాబాద్: రమేష్ రాథోడ్ 2. మహబూబాబాద్ : బలరాం నాయక్ 3.పెద్దపల్లి : ఎ. చంద్రశేఖర్ 4. కరీంనగర్ : పొన్నం ప్రభాకర్ 5. మల్కాజిగిరి : రేవంత్ రెడ్డి 6.జహీరాబాద్ : మదన్ మోహన్ 7. చేవెళ్ల : కొండ విశ్వేశ్వర్ రెడ్డి 8. మెదక్ : గాలి అనిల్ కుమార్ . ఇంకా మరో తొమ్మిది ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నల్గొండ, ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌‌ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. శనివారం రెండో జాబితా విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories