గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబరాలు ..

గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబరాలు ..
x
Highlights

తెలాంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంది .. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం అ పార్టీకి చేదు అనుభవాన్ని ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా...

తెలాంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంది .. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం అ పార్టీకి చేదు అనుభవాన్ని ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎంపీ ఎలక్షన్స్ లోకి దిగింది కాంగ్రెస్ ఇక తాజాగా నిన్న విడుదల అయిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మూడు చోట్లల్లో విజయకేతనం ఎగరవేసింది .. దీనితో గాంధీభవన్ లో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు . గెలిచినా అభ్యర్దులు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ( నల్గొండ ), రేవంత్ రెడ్డి (మల్కాజిగిరి), కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( భువనగిరి) కి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల భాధ్యుడు కుంతియా .. అయితే ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లడారు ..

కేసీఆర్ అహంభావానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు అయన.. ప్రజలు ఆయనకి చక్కని గునాపాటం చెప్పరని అన్నారు ఉత్తమ్.. కేసీఆర్ డబ్బులకు ఎంపీ సీట్లు అమ్ముకున్నారని ప్రజలకు తెలియని నేతలను బరిలోకి దించారని అన్నారు .. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక మోసపూరిత మాటలతో అయన ప్రభుత్వం పబ్బం గడుపుతుందని విమర్శించారు .. ఉత్తమ్ నల్గొండ లోక్ సభ స్థానానికి ఎంపీక కావడంతో అయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ స్థానానికి గాను రాజీనామా చేయనున్నారు .. దీనిపైన ఈ రోజు ఓ క్లారిటీ రానుంది ..

Show Full Article
Print Article
Next Story
More Stories