మోడీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రకి స్కెచ్ : కనకమేడల

మోడీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రకి స్కెచ్ : కనకమేడల
x
Highlights

తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా కేసీఆర్, జగన్ తో కలిసి ఓట్ల తొలగింపు కార్యక్రమం చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ఆరోపించారు. ఓట్లు...

తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా కేసీఆర్, జగన్ తో కలిసి ఓట్ల తొలగింపు కార్యక్రమం చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ఆరోపించారు. ఓట్లు తొలగించడానికి 175 నియోజకవర్గాల్లో పెద్ద స్కెచ్ వేశారని చెప్పారు. టీడీపీకి సంబంధించిన ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అర్ధరాత్రి దాడులు చేయడం ఏంటి? వైసీపీ వాళ్లు ఫిర్యాదు చేయగానే ఐటీ గ్రిడ్ పై దాడులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దాడుల వెనుక కుట్ర ఉందని మోడీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రకి స్కెచ్ వేశారని కనకమేడల చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories