దాడులకు పాల్పడినవారికే ఈసీ వత్తాసు: బుద్దా వెంకన్న

దాడులకు పాల్పడినవారికే ఈసీ వత్తాసు: బుద్దా వెంకన్న
x
Highlights

దాడులకు పాల్పడినవారికి ఎన్నికల కమిషన్ వత్తాసు పలుకుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు సజావుగా జరగడానికి కేంద్రం...

దాడులకు పాల్పడినవారికి ఎన్నికల కమిషన్ వత్తాసు పలుకుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు సజావుగా జరగడానికి కేంద్రం ప్రత్యేక భద్రత దళాలను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. 15 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న విజయసాయిరెడ్డికి ఈసీ అపాయింట్‌మెంట్ ఇస్తుందా? అని బుద్దా వెంకన్న మండిపడ్డారు. చెత్తలో దొరికిన వీవీ పాట్‌ల విషయంపై ఈసీ ఏమి సమాధానం చెపుతుందని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. జగన్‌ను గెలిపించడానికి మోడీ అనేక కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఓక్స్ వాగన్ కేసులో పేరున్న బొత్సకు ఈసీ అపాయింట్‌మెంట్ ఇస్తుందా? అని బుద్దా వెంకన్న మండిపడ్డారు. చెత్తలో దొరికిన వీవీ పాట్‌ల విషయంపై ఈసీ ఏమి సమాధానం చెపుతుందని ప్రశ్నించారు. ఈసీ ఆఫీస్‌లో విజయసాయిరెడ్డికి రాచ మర్యాదలు చేయడం ఏంటని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. మోడీ కుట్రలను ఎండగట్టేందుకు చంద్రబాబు వారణాసిలో ప్రచారం నిర్వహిస్తారన్నారు. మోడీ మోసాలను వారణాసి ప్రజలకు చెప్పేందుకు చంద్రబాబు ప్రచారానికి వెళ్తారని బుద్దా వెంకన్న తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories