ఆ విషయం జగన్‌కు కూడా తెలుసు: బుద్దా వెంకన్న

ఆ విషయం జగన్‌కు కూడా తెలుసు: బుద్దా వెంకన్న
x
Highlights

ఏపీలో ఏర్పడేది టీడీపీ ప్రభుత్వమే అంటూ తొడకొట్టి చెబుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకమే...

ఏపీలో ఏర్పడేది టీడీపీ ప్రభుత్వమే అంటూ తొడకొట్టి చెబుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకమే టీడీపీని గెలిపిస్తోందని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేను మించి 130 సీట్లు సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. విభజనతో కుదేలయిన ఏపీని తన కష్టంతో చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారన్నారు. టీడీపీ ఓటు వేసేందుకు వంద కారణాలు ఉంటే వైసీపీకి ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారంటూ ప్రశ్నించారు . వైసీపీ ఓడిపోతుందనే విషయం జగన్‌కు కూడా తెలుసన్నారు. సర్వేలు చాలా చోట్ల అంచనాలు తప్పుతున్నాయని ఎన్డీఏకి చాలా తక్కువ సీట్లు వస్తున్నాయన్నారు. అయితే ఎక్సిట్ పోల్స్‌లో కావాలని మోదీ హైప్ చేయించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తున్నామని వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. వైసీపీకి అనుకూల సర్వే లన్నీ మోదీ ఆదేశాల మేరకే అలా చెప్పాయన్నారు. మోదీకి వత్తాసు పలికే చానళ్లే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నాయని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories