వైసీపీలో చేరికపై మంత్రి పితాని క్లారిటీ..

వైసీపీలో చేరికపై మంత్రి పితాని క్లారిటీ..
x
Highlights

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను మంత్రి పితాని సత్యనారాయణ ఖండించారు. తనపై దుష్ప్రచారం తగదన్నారు. వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు...

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను మంత్రి పితాని సత్యనారాయణ ఖండించారు. తనపై దుష్ప్రచారం తగదన్నారు. వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టంచేశారు. పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో సీఎం తనను పిలిచారని చెప్పిన పితాని తాను కచ్చితంగా పార్టీ మారనని ఆయనకు వివరించానని తెలిపారు. తొమ్మిది నెలలుగా తనపై ఇలాంటి దుష్ర్పచారం జరుగుతోందని మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. వ్యక్తిగతంగా ఎవరికీ నష్టం కలిగించొద్దనే మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. హైదరాబాద్‌, ఢిల్లీ వెళ్తే తప్పేంటి? హైదరాబాద్‌ వెళ్లినంత మాత్రాన పార్టీ మారినట్లా? అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు తనను ఆశీర్వదిస్తారని పితాని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories