టీడీపీ మేనిఫెస్టో.. పింఛన్‌ రూ.3 వేలు!

టీడీపీ మేనిఫెస్టో.. పింఛన్‌ రూ.3 వేలు!
x
Highlights

మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార టీడీపీ మరిన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. అధికారాన్ని శాశ్వతంగా కైవసం చేసుకుంటామని చెబుతున్న సీఎం చంద్రబాబు...

మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార టీడీపీ మరిన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. అధికారాన్ని శాశ్వతంగా కైవసం చేసుకుంటామని చెబుతున్న సీఎం చంద్రబాబు తాజాగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోలో మరోసారి ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేసినట్టు సమాచారం. మళ్లీ అధికారంలోకి వస్తే కనీస పింఛనును రూ. 3 వేలకు పెంచాలని నిర్ణయించింది. గతంలో ఈ పింఛన్ రూ. 200 కాగా, ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని రూ. 2 వేలు చేసింది. ఇప్పుడు టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిచి మరోమారు అధికారంలోకి వస్తే దానిని మూడు వేలు చేస్తామని హామీ ఇవ్వబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories