పోలవరం టికెట్‌పై తమ్ముళ్ల రచ్చ

పోలవరం టికెట్‌పై తమ్ముళ్ల రచ్చ
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వద్దంటూ అసమ్మతి వర్గం ఆందోళనకు...

ఏపీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వద్దంటూ అసమ్మతి వర్గం ఆందోళనకు దిగింది. కుర్చీలు విసిరేస్తూ బారికేడ్లు నెట్టివేశారు. అసమ్మతి, అనుకూల వర్గాల మధ్య తోపులాట, తీవ్రవాగ్వాదం జరిగింది.

మొడియం శ్రీనివాస్‌కు కాకుండా వేరే ఎవరికైనా సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొడియం శ్రీనివాస్‌కు సీటు ఇస్తే ఓటమి తప్పదని హెచ్చరించారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ శ్రీనివాస్‌కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. శ్రీనివాస్ ‌ అభివృద్ధిని పట్టించుకోలేదని చెప్పారు. మరోవైపు నాయకులు, కార్యకర్తలు మొడియం శ్రీనివాస్ కే సీటు కేటాయించాలని కోరుకుంటున్నట్లు ఆయన అనుకూల వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గెలిస్తే వారి ఆటలు సాగవని ఆందోళన చేస్తున్నారని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories