స్ట్రెచర్‌పై పడుకుని ప్రచారం..

స్ట్రెచర్‌పై పడుకుని ప్రచారం..
x
Highlights

ఈ ఒక్క ఫోటో చూసి అక్కడి నియోజకవర్గ ప్రజలంతా అయ్యోం పాపం అని కన్నీరు కారుస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థికి వచ్చిన కష్టం చూసి...

ఈ ఒక్క ఫోటో చూసి అక్కడి నియోజకవర్గ ప్రజలంతా అయ్యోం పాపం అని కన్నీరు కారుస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థికి వచ్చిన కష్టం చూసి బాధపడని వారు ఉండరంటే అతిశయోక్తి కానే కాదు. ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్యాలకుర్తి తిక్కారెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి నెలకింద ఖగ్గల్లు గ్రామానికి ప్రచారానికి వెళ్లాడు. అయితే ఆ గ్రామం వైసీపీకి పెట్టని కోట దీంతో తిక్కారెడ్డిని వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది.

ఇక దీంతో ఆయనకు సెక్యూరిటీగా వెళ్లిన గన్ మెన్ గాల్లోకి కాల్పులు ఘటనలో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్‌ గాయమై నెలరోజులపాటు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకున్నారు. అంబులెన్స్‌లో స్ట్రెచర్‌పై వచ్చి నామినేషన్‌ సమర్పించారు. ఇక ఇప్పుడు ఎన్నికల పొలింగ్ దగ్గరపడుటుండంతో స్వయంగా తిక్కరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తన మంత్రాలయం నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చాడు. ఎర్రటి ఎండని సైతం లెక్కచేయకుండా ప్రచారం చేస్తున్నారు. తిక్కరెడ్డి భార్య వెంకటేశ్వరమ్మ కలిసి గ్రామాల్లో రోడ్‌షోలకు వెళ్తున్నారు. వీరిద్దరి ప్రచారం చూసిన మహిళలు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమకు ఓటు వేయాలని కొంగుచాటి అడుగుతున్న వెంకటేశ్వరమ్మ స్టెచర్ పై తిక్కారెడ్డి ఫొటోలు ఇప్పడు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి వీరి దీనస్థితికి ప్రజలు కరిగి సెంటిమెంట్‌గా వర్కవుట్ అయ్యి భారీగానే ఓట్లుపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories