కర్నూలు అసెంబ్లీ స్థానం వ్యవహారంలో కోల్డ్ వార్

కర్నూలు అసెంబ్లీ స్థానం వ్యవహారంలో కోల్డ్ వార్
x
Highlights

క‌ర్నూలు అసెంబ్లీ స్థానం వ్యవహారంలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. కర్నూలు సీటు ఎస్వీ మోహ‌న్ రెడ్డి కుటుంబానిది కాద‌ని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్...

క‌ర్నూలు అసెంబ్లీ స్థానం వ్యవహారంలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. కర్నూలు సీటు ఎస్వీ మోహ‌న్ రెడ్డి కుటుంబానిది కాద‌ని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే ఎస్వీ చెప్పడంపై టీజీ స్పందించారు. కర్నూలు స్థానం ఎవరికి ఇవ్వాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు సర్వేలు చేయించి టికెట్ కేటాయిస్తారన్నారు నిన్న సీటు తనదే అన్న ఎస్వీ నేడు లోకేష్ నిలబడితే సమర్ధిస్తానని చెప్పారన్నారు. లోకేష్ నిలబడితే అందరం సమర్ధిస్తామని టీజీ చెప్పారు మాయ మాటలు చెప్పి జనాలను గందరగోళానికి గురిచేయడం తప్ప ఇంకేమీ లేదని ఆయన అన్నారు గెలిచే అభ్యర్థికే చంద్రబాబు పట్టం కడతారని మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందని టీజీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories