మంత్రి అఖిల ప్రియకు షాక్‌..!

మంత్రి అఖిల ప్రియకు షాక్‌..!
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు వేళ మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్ తగిలింది. భూమా అఖిల ప్రియ సొంత మేనమామా, టీటీపీ నేత ఎస్వీ జగన్‌ రెడ్డి వైసీపీ...

సార్వత్రిక ఎన్నికలు వేళ మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్ తగిలింది. భూమా అఖిల ప్రియ సొంత మేనమామా, టీటీపీ నేత ఎస్వీ జగన్‌ రెడ్డి వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. ఆళ్లగడ్డకు చెందిన ఎస్వీ జగన్‌ శనివారం లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు. జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎస్వీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.

వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరారు. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో నెల్లూరు రూరల్ స్థానం నుంచి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఆ పార్టీలో చేరారు. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా వైసీపీలో చేరారు. ఇక బుట్టా రేణుక కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్‌ జగన్‌ పార్టీ కండువ కప్పి వారందరినీ సాదరంగా ఆహ్వానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories