దాసరి, అక్కినేని, హరికృష్ణల విగ్రహాల తొలగింపు

దాసరి, అక్కినేని, హరికృష్ణల విగ్రహాల తొలగింపు
x
Highlights

విశాఖ ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన సినీ ప్రముఖుల విగ్రహాలను అధికారులు తొలగించరు. గతేడాది డిసెంబర్‌ మొదటి వారంలో మంత్రి గంట శ్రీనివాసరావు, యార్లగడ్డ...

విశాఖ ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన సినీ ప్రముఖుల విగ్రహాలను అధికారులు తొలగించరు. గతేడాది డిసెంబర్‌ మొదటి వారంలో మంత్రి గంట శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణ విగ్రహాలను బీచ్‌ రోడ్డులో ఏర్పాటు చేశారు. అయితే జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే విగ్రహాలను ఏర్పాటటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు ప్రజాసంఘాలు కోర్డును ఆశ్రయించాయి. కాగా దీంతో కోర్డు ఆ విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. దీంతో అర్ధరాత్రి సమయంలో జేసీబీలు, GVMC కార్మికులతో కలిసి వచ్చిన అధికారులు విగ్రహాలను తొలగించారు. GVMC జోన్ 2 ఏసీపీ నాయుడు ఆధ్వర్యంలో విగ్రహాలను తొలగించారు. GVMC అనుమతి లేకపోవడంతోనే వీటిని తొలగించినట్టు అధికారులు తెలియజేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories