నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ వద్ద ఆందోళనలు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ వద్ద ఆందోళనలు
x
Highlights

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వ్యాపారులు సోసైటీ కార్యాలయం ఎదుట...

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వ్యాపారులు సోసైటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వ్యాపారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. నాలుగు రూపాయలు వస్తాయని వడ్డీలకు అప్పులు తెచ్చి స్టాల్స్ ఏర్పాటు చేశామని సర్వం కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి ప్రమాదం జరిగినా ఇంత వరకు ఒక్కరూ కూడా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాసేపట్లో అగ్నిప్రమాదం జరిగిన ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories