మే 23న యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సోనియా భేటీ

మే 23న యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సోనియా  భేటీ
x
Highlights

సార్వత్రిక ఫలితాల వెల్లడికి ఒక రోజు ముందు యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో సమావేశం కానున్నారు. మే 23న యూపీఏ భాగస్వామ్య...

సార్వత్రిక ఫలితాల వెల్లడికి ఒక రోజు ముందు యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో సమావేశం కానున్నారు. మే 23న యూపీఏ భాగస్వామ్య పక్షాలు, ఇతర పార్టీలతో నిర్వహించనున్న సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఆమె చర్చించనున్నారు. ఒకవేళ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాని తరుణంలో ఆ పార్టీకి అధికారం దక్కకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తారు. ఎన్డీయేతర పక్షాలు యూపీయేతో కలిసేందుకు ఎలాంటి విధానాలు అవలంబించాలనే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌, ఆర్జేడీ, టీఎంసీ ఇతర పార్టీలకు కాంగ్రెస్ వర్తమానం పంపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories