చిన్నారి ప్రాణం తీసిన కరెంట్ తీగ

చిన్నారి ప్రాణం తీసిన కరెంట్ తీగ
x
Highlights

హైదరాబాద్‌ బండ్లగూడలోని పెబెల్ సిటీ నివాస సముదాయంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి...

హైదరాబాద్‌ బండ్లగూడలోని పెబెల్ సిటీ నివాస సముదాయంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని విద్యుత్ అధికారులు ప్రకటించారు.

అయితే, పెబెల్ సీటీలో్ బాలుడు మూసీన్ విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెబెల్ సిటీ సొసైటీ సభ్యులు విద్యుత్ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories