'సాహో' స్పీడ్ పెంచనున్నారట

సాహో స్పీడ్ పెంచనున్నారట
x
Highlights

'బాహుబలి' సినిమా తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో 'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు....

'బాహుబలి' సినిమా తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో 'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మేకింగ్ వీడియోలు రెండూ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నీల్ నితిన్ ముకేశ్, జాకీ శ్రోఫ్, మందిరా బేడీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్ట్ 15 న విడుదల కావాల్సి ఉంది కాని అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

అయితే ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైంది. సినిమా సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు అయింది. కానీ ఇన్నాళ్ళైనా షూటింగ్ మాత్రం పూర్తవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా కొంత నిరాశచెందాడట. అందుకే దర్శకుడికి తన పాత్ర షూటింగ్ త్వరగా పూర్తి చేసి తనని వదిలిపెట్టమని చెప్పాడట. దీంతో సుజిత్ కూడా ప్రభాస్ సీన్ల వరకు ముందుగా పూర్తి చేసి ప్రభాస్ ని వదలాలి అని ప్లాన్ చేస్తున్నాడట. ఈ నేపధ్యంలో షూటింగ్ స్పీడ్ పెంచనున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయినే గా నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories