హజీపూర్‌ వరుస హత్యలు.. సంచలన నిజాలు!

హజీపూర్‌ వరుస హత్యలు.. సంచలన నిజాలు!
x
Highlights

హాజీపూర్‌‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి. హాజీపూర్‌‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి. పోలీసుల ఇంటరాగేషన్‌లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఇస్తున్న...

హాజీపూర్‌‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి. హాజీపూర్‌‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి. పోలీసుల ఇంటరాగేషన్‌లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఇస్తున్న ఇన్ఫర్మేషన్‌తో సీరియస్‌ మర్డర్స్‌ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రెండు పాడుబడ్డ బావుల్లో అమ్మాయిల మృతదేహాలు, అస్థి పంజరాలు బయటపడుతున్నాయి. టెన్త్‌ విద్యార్ధిని శ్రావణిని రేప్ అండ్ మర్డర్ చేసి మృతదేహాన్ని పడేసిన బావిలోనే, మరో అమ్మాయి అస్థి పంజరం బయటపడటంతో హాజీపూర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం రేగుతోంది.

బొమ్మలరామారం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే హాజీపూర్‌‌కు రవాణా సౌకర్యం లేకపోవడంతో దాన్నే తనకు అనుకూలంగా మార్చుకున్న నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి లిఫ్ట్ పేరుతో అమ్మాయిలతో స్నేహంచేసి వాళ్లకు తనపై నమ్మకం కుదిరాక. ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం మనీషాకి లిఫ్ట్‌ ఇచ్చి రేప్ అండ్ మర్డర్ చేసిన శ్రీనివాస్‌రెడ్డి తాజాగా శ్రావణిని ఇదే తరహాలో అత్యాచారంచేసి చంపినట్లు ఇంటరాగేషన్‌లో తేలింది. సైకో శ్రీనివాస్‌రెడ్డి నేర చరిత్రపై దృష్టిపెట్టిన రాచకొండ పోలీసులు వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నారు. రేప్ అండ్ మర్డర్స్‌తోపాటు చైన్ స్నాచింగ్స్‌, దొంగతనాలు ఇతర నేరాల చిట్టా బయటికి తీస్తున్నారు. హాజీపూర్ ఘటనలో అంతా అనుమానించినట్టుగానే జరిగింది. ఈ వ్యవహారంలో అనుమానితుడిగా భావిస్తూ అదుపులోకి తీసుకున్న శ్రీనివాసరెడ్డి తన నేరాన్ని అంగీకరించాడు. శ్రావణితో పాటు మనీషా, కల్పనలను తానే చంపినట్టు ఒప్పుకున్నాడు.

అమ్మాయిలపై అత్యాచారంచేసి చంపిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌‌రెడ్డిపై హాజీపూర్ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. సైకో శ్రీనివాస్‌‌రెడ్డిని ఎన్‌‌కౌంటర్ చేయాలంటూ, పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ, శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై దాడిచేసి, నిప్పంటించారు. ఇంటిని ధ్వంసం చేయడంతోపాటు సామగ్రిని బయటికి తీసుకొచ్చి తగలబెట్టారు. దాంతో హాజీపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అలర్టైన పోలీసులు గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు హాజీపూర్‌లో పర్యటించిన కలెక్టర్ అనితా రామచంద్రన్‌‌ గ్రామస్తులను శాంతింపజేశారు. నిందితుడ్ని పట్టుకుని, ఇంటరాగేషన్‌ చేస్తున్నారన్న కలెక్టర్‌, గ్రామంలో భద్రతా చర్యలు చేపడతామన్నారు. పాడుబడ్డ బావులను పూడ్చటంతోపాటు ఊరంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే హాజీపూర్‌ సీరియల్‌ మర్డర్స్‌లో పోలీసుల నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోందంటున్న మహిళలు, నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. సైకో కిల్లర్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డిని పోలీసులు శిక్షించకపోతే, తామే శిక్షిస్తామని హాజీపూర్ గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

వరుస హత్యలతో హాజీపూర్ వణుకుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అమ్మాయిలు మానవ మృగానికి బలైపోయారు. శ్రావణి, మనీషా మర్డర్స్‌ మిస్టరీ తర్వాత నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన బాలిక కల్పన కూడా హాజీపూర్ బావిలోనే సమాధి అయ్యిందనే నిజం బయటపడింది. ఇప్పటివరకు తమ కూతురు బతికే ఉందని భావించామని, కానీ శ్రావణి మర్డర్‌ తర్వాతే, తమ కూతుర్ని కూడా శ్రీనివాస్‌రెడ్డే చంపేశాడని అనుమానం వచ్చిందని, ఇప్పుడదే నిజమైందని కల్పన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురిని చంపిన చోటే, శ్రీనివాస్‌రెడ్డిని కూడా చంపాలన్నాడు కల్పన తండ్రి. పోలీస్‌ స్టేషన్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదని కల్పన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. మైనర్ బాలికలను ట్రాప్‌ చేసి, అఘాయిత్యాలకు పాల్పడిన శ్రీనివాస్‌‌రెడ్డిని ఎన్‌‌కౌంటర్ చేయాల్సిందేనని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories