భానుడి ప్రతాపానికి గురైన నెమలి.. సెలైన్ ఎక్కించిన వైద్యులు

భానుడి ప్రతాపానికి గురైన నెమలి.. సెలైన్ ఎక్కించిన వైద్యులు
x
Highlights

భానుడి ప్రతాపానికి జనాలతో పాటు.. మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పడరాని ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడైనా నీరు...

భానుడి ప్రతాపానికి జనాలతో పాటు.. మూగ జీవాలు విలవిలలాడిపోతున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పడరాని ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడైనా నీరు కనబడితే చాలు.. అక్కడ వాలిపోతున్నాయి. జనగామ జిల్లా శివారులో జాతీయ పక్షి నెమలి భానుడి భగభగను తట్టుకోలేకపోయింది. ఓ బోరు వద్ద వస్తున్న నీటి వద్దకు వెళ్లి.. కాసేపు సేదతీరింది. అయినప్పటికీ అది స్పృహ కోల్పోయింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని అంబులెన్స్‌ సిబ్బంది ఆ నెమలికి చికిత్స అందించింది. ఆ నెమలికి సెలైన్ ఎక్కించి ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించారు.







Show Full Article
Print Article
Next Story
More Stories