సాధ్వి ప్రగ్యా కంట కన్నీరెందుకు?

సాధ్వి ప్రగ్యా కంట కన్నీరెందుకు?
x
Highlights

తన శాపం తగిలి చచ్చిపోయారంటూ మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేపై నోరు పారేసుకున్న సాధ్వీ ప్రగ్యా లో ఎన్నడూ చూడని బేలతనం ఇవాళ కనిపించింది. భోపాల్ లో...

తన శాపం తగిలి చచ్చిపోయారంటూ మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేపై నోరు పారేసుకున్న సాధ్వీ ప్రగ్యా లో ఎన్నడూ చూడని బేలతనం ఇవాళ కనిపించింది. భోపాల్ లో విస్తృతంగా పర్యటిస్తున్న ప్రగ్యా ప్రచారంలో తన గురువైన కేంద్ర మంత్రి ఉమా భారతిని కలుసుకోవడంతో ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఉబికి వచ్చే దు:ఖాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. ప్రగ్యాను అక్కున చేర్చుకున్న ఉమా భారతి ఆమెను ఓదారుస్తూ ఉండిపోయారు. భోపాల్ ఎన్నికల ప్రచారంలో కనిపించిన విచిత్రమిది. సమావేశం ముగించుకుని ప్రగ్యాసింగ్ తిరిగి వెళ్తుండగా ఆమెను సాగనంపేందుకు ఉమాభారతి కూడా వచ్చారు. ఆమెను కారు ఎక్కించి, సీటులో దిండు వేసి కూర్చోబెట్టారు. కాళ్లకు మొక్కి నమస్కరించారు. ఈ సందర్భంగా ప్రగ్యాసింగ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమెను చూసి ఉమాభారతి కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రగ్యాసింగ్‌ను ఓదార్చి ధైర్యం చెప్పి పంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories