రూ.10 కోట్లతో ఈవీఎం హ్యాక్‌చేసి గెలవచ్చు..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రూ.10 కోట్లతో ఈవీఎం హ్యాక్‌చేసి గెలవచ్చు..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
x
Highlights

ఈవీఎంలపై దుమారం రేగుతున్న వేళ చంద్రబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి వచ్చిన వ్యక్తులు ఈవీఎంలను రష్యన్లు హ్యాక్ చేస్తారని బాంబు...

ఈవీఎంలపై దుమారం రేగుతున్న వేళ చంద్రబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి వచ్చిన వ్యక్తులు ఈవీఎంలను రష్యన్లు హ్యాక్ చేస్తారని బాంబు పేల్చారు. రూ.10 కోట్లిచ్చిన అభ్యర్థిని ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా గెలిపిస్తారని వ్యాఖ్యానించారు.ఈవీఎంలలో లోపాలను సరిదిద్దడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. చాలా దేశాలు బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమికి ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి వెళ్లిన ఆయన ఈవీఎం లోపాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఓట్ల లెక్కింపునకు 6రోజులు పడుతుందని ఎన్నికల సంఘం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎవరికి ఓటు వేశామనేది వీవీప్యాట్‌లో 7 సెకన్లు కనపడాలని అది కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు.

వీవీప్యాట్‌ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారని ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోలాలన్నారు. ఈవీఎంల్లో లోపాలు వస్తే సరిచేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఉదయం లోపాలు వస్తే మధ్యాహ్నానికి సరిచేసే పరిస్థితి ఉందని చెప్పారు. ఏపీలో సీఈవో కూడా ఓటు వేసేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ హయాంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు నిర్వీర్యమయ్యాయని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories