కేటీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు..

కేటీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు..
x
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా కేటీఆర్ తన ట్వీట్టర్‌లో అభిమానులతో చిట్ చాట్...

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా కేటీఆర్ తన ట్వీట్టర్‌లో అభిమానులతో చిట్ చాట్ చేసిన విషయం తెలిందే కాగా అందులో కేటీఆర్‌ను పలువురు ప్రశ్నల వర్షం కురింపించారు. అందులో భాగంగానే గ్లోబరీనా ప్రస్తావన తీసుకొచ్చారు. దానికి కేటీఆర్ సమాధానం ఇస్తూ గ్లోబరీనా గురించి తెలియదంటూ చెప్పుకొచ్చారు. దీనికి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చురకలంటిస్తూ గ్లోబరీనా సంస్థ గురించి తనకు తెలియదని అంటూ తెలంగాణ ప్రజలను ‎మోసం చేస్తున్నారని కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. గతంలో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే ఈ సంస్థకు టెండర్లు ఇచ్చారనే విషయాన్ని మర్చిపోయారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను పక్కన పెట్టి మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్, గ్లోబరీనాలకు టెండర్లు కట్టబెట్టారన్నారు. అసలు గ్లోబరీనా సంస్థ యజమాని విజయ్‌రావు అల్లుడు ప్రద్యుమ్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ క్లాస్‌మేట్స్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2016 ఎంసెంట్ ప్రశ్నాపత్రాల లీకేజీలో మ్యాగ్నెటిక్ సంస్థకు సంబంధం ఉందని అయినా అప్పట్లో ప్రభుత్వం ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ విమర్శించారు. గ్లోబరీనా, మ్యాగ్నటిక్ సంస్థలూ రెండు భాగస్వామ్య సంస్థలు. దుర్మార్గంగా 23 మంది చావులకు కారణమయ్యాయి. కంపెనీల పేర్లు వేరు వీళ్లంతా ఒక్కటే. కలిసి వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమకు ఏమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories