బెంగళూరు బోణీ

బెంగళూరు బోణీ
x
Highlights

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఎట్టకేలకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో కింగ్స్...

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఎట్టకేలకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (64 బంతుల్లో 99 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. చహల్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ కోహ్లి (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ఏబీ డివిలియర్స్‌ (38 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో అదరగొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories