బీజేపీలో చేరిన రాపోలు ఆనంద భాస్కర్

బీజేపీలో చేరిన రాపోలు ఆనంద భాస్కర్
x
Highlights

ఎన్నికలు దగ్గర పడటంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్‌ తగిలింది....

ఎన్నికలు దగ్గర పడటంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్‌ తగిలింది. రాజ్యసభ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ గూటికి చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సైద్దాంతిక విధానం, ప్రాంతీయ భావజాం వంటి లేని కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోయానన్నారు రాపోలు ఆనంద భాస్కర్. చేనేత సామాజిక వర్గానికి ఆత్మగౌరవ దిశగా ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవంగా బీజేపీ నా కృషిని గుర్తించిందని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, దేశ సమగ్రత కోసం బీజేపీలో చేరినట్లు తెలిపారు. పార్టీలోఎంత నిబద్దతతో పనిచేసినా కాని తన పట్ల పార్టీ నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరించిందని రాపోలు ఆనంద భాస్కర్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories