సుప్రీంకోర్టు ముందుకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌

సుప్రీంకోర్టు ముందుకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌
x
Highlights

ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్శ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం అక్కడక్కడ విడుదైలన విషయం తెలిసిందే కాగా ఏపీలో ఈ...

ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్శ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం అక్కడక్కడ విడుదైలన విషయం తెలిసిందే కాగా ఏపీలో ఈ సినిమా ప్రదర్శనకు మాత్రం ఏపీ హైకోర్టు ఒప్పుకోకపోవడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్‌‌ చిత్ర నిర్మాత రాకేష్‌ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏపీలో చిత్రం నిలిపివేయడంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఏపీ హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని నిర్మాత రాకేష్‌ రెడ్డి సుప్రీంకోర్టును కోరారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రివ్యూను న్యాయమూర్తులు చూసిన తరువాత తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాకేష్‌ రెడ్డి సుప్రీంను ఆశ్రయించాల్సివచ్చింది. సుప్రీంకోర్టులోనైనా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్‌‌ చిత్రం తప్పకుండా విడుదల అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories