టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
x
Highlights

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న...

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో చెన్నై జట్టు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా ఐదు మ్యాచ్‌లాడి కేవలం ఒక్క విజయాన్ని తమ ఖాతాలో వేసుకుని పట్టికలో ఏడో స్థానంలో ఉంది. దీంతో గెలుపు కోసం రాజస్థాన్ చెమటోడ్చడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక చెన్నై జట్టులో ఓపెనర్ షేన్ వాట్సన్ నిరాశపరుస్తున్నా మరో ఓపెనర్ డుప్లెసిస్ నిలకడగా ఆడుతున్నాడు. ఇక మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీలతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. రాజస్థాన్ జట్టులో సంజూ శాంసన్, ఉనద్కట్ జయదేవ్ తిరిగి చోటు దక్కించుకోగా రియాన్ ప్రయాగ్ ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేస్తున్నాడు. చూడాలి మరీ నేటి మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories