టీడీపీకి షాక్‌...వైసీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే..!?

tdp
x
tdp
Highlights

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సొంత పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, ఈసారి టికెట్ రాదని భావిస్తున్న నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సొంత పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, ఈసారి టికెట్ రాదని భావిస్తున్న నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తాజాగా టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి రాజీనామా చేసి ఈ నెలాఖరులో ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో మంతనాల తర్వాత మేడా మల్లిఖార్జునరెడ్డి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం సాగుతోంది. టీడీపీలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతోనే మేడా మల్లికార్జునరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.





Show Full Article
Print Article
Next Story
More Stories