టీ కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ కీలక భేటీ

టీ కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ కీలక భేటీ
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. కాగా ఇటివల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపొయిన విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో రాహుల్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కుంతియ తదితరులు సమావేశమై చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన ప్యూహంపై చర్చ జగినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ని పూర్తి స్థాయిలో రానున్న అన్ని ఎన్నికలకు సమాయత్తం చేయాలని రాహుల్ గాంధీ ఆదేశించట్లు పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్ధులే పంచాయతీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయా నియోజకవర్గాలకు ఇంచార్జ్ లు గా వ్యవహరించాలని అధిష్ఠానం ఆదేశించినట్లు ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుత ప్రదేశ్ ఎన్నికల కమిటీ ని సైజు ను తగ్గించి, కొత్తగా 15 మందితో కమిటీ ని ఏర్పాటు చేయడం, లోక సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందని ఉత్తమ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories