ప్రియాంక గాంధీ ఎంట్రీతో మాకేలాంటి నష్టం లేదు..!

ప్రియాంక గాంధీ ఎంట్రీతో మాకేలాంటి నష్టం లేదు..!
x
Highlights

ఇటివలే కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర యూపీ ఇన్‌ఛార్జ్‌గా ప్రియాంకా గాంధీ వ‌ద్రాను నియమించిన విషయం తెలిసిందే కాగా ప్రియాంకా గాంధీ వ‌ద్రాపై ఉత్తరప్రదేశ్...

ఇటివలే కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర యూపీ ఇన్‌ఛార్జ్‌గా ప్రియాంకా గాంధీ వ‌ద్రాను నియమించిన విషయం తెలిసిందే కాగా ప్రియాంకా గాంధీ వ‌ద్రాపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ నేడు మొట్టమొదటిసారిగా స్పందించారు. ప్రియాంక వద్రా యూపీ రాజకీయాల్లోకి రావడం వల్ల బీజేపీకి ఎలాంటి నష్టంలేదని గ‌తంలోనూ ప్రియాంకా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశార‌ని యోగి అన్నారు. ఎస్పీ, బీఎస్పీ కూట‌మి కూడా త‌మ పార్టీని ఏమీ చేయ‌లేద‌న్నారు. ఈనెల 18నుంచి 20 వరకు ప్ర‌యాగ్‌రాజ్ నుంచి ప్రియాంకా గంగా యాత్ర చేప‌ట్ట‌నున్న‌ది. బోటు ద్వారా ఆమె వార‌ణాసి వ‌ర‌కు ప్ర‌చారంలో పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories