మోడీకి దేశాలు తిరగడానికి సై.. సమస్యలు పట్టించుకోవాడానికి నైయ్.

మోడీకి దేశాలు తిరగడానికి సై.. సమస్యలు పట్టించుకోవాడానికి నైయ్.
x
Highlights

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ గంగా యాత్రను ప్రారంభించారు. గంగా నదిలో స్టీమరు బోటులో ప్రయాణిస్తూ నదీ తీర గ్రామాల్లో ప్రియాంక...

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ గంగా యాత్రను ప్రారంభించారు. గంగా నదిలో స్టీమరు బోటులో ప్రయాణిస్తూ నదీ తీర గ్రామాల్లో ప్రియాంక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రధానికి ప్రపంచంలో చాలా దేశాలు తిరగడానికి సమయం ఉంటుంది గానీ దేశంలో సమస్యలు పట్టించుకునే తీరిక లేదని మోడీపై ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేవలం మోడీ ధనవంతులకే వాళ్లు కాపలాదారులు, రైతులకు కాదని అన్నారు. ప్రధాని మోడీ పారిశ్రామికవేత్తలైన తన స్నేహితుల కోసమే పనిచేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలో అన్ని వ్యవస్థలను మోడీ నాశనం చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. కొందరు రాజకీయ గిమ్మిక్కుల ప్రయోగిస్తున్నారనీ అందుకే ప్రజలు తమ ఇబ్బందులను తనతోనూ, కాంగ్రెస్ నాయకులతోనూ పంచుకుంటున్నారని ప్రియాంక గాంధీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories