తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం...మద్యం మత్తులో ఏడు నెలల గర్భిణిపై...

pregnant woman
x
pregnant woman
Highlights

మానవత్వం సిగ్గుతో తలదించుకుంది. నాతిచరామి అంటూ వేదాలు వల్లిస్తూ వివాహ వ్యవస్ధకు మాయని మచ్చలాంటి ఘటన గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యపై మద్యం మత్తులో ఉన్న భర్త దాడికి దిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

మానవత్వం సిగ్గుతో తలదించుకుంది. నాతిచరామి అంటూ వేదాలు వల్లిస్తూ వివాహ వ్యవస్ధకు మాయని మచ్చలాంటి ఘటన గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యపై మద్యం మత్తులో ఉన్న భర్త దాడికి దిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

బుర్రిపాలెం గ్రామానికి చెందిన వీరాస్వామి భార్య ఏడు నెలల గర్భిణి. నొప్పులు రావడంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే తనకు చెప్పకుండా ఆసుపత్రిలో చేరిందని ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త వీరస్వామి ఆసుపత్రిలోనే దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో కడపులోని బిడ్డ కడుపులోనే చనిపోయింది. తీవ్ర రక్తస్రావమై బాధతో అల్లాడుతున్న మహిళను తెనాలి వైద్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెనాలి పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories